దేవుడితో చెలగాటాలొద్దు : సీఎం జగన్ వార్నింగ్..!

ఏపీలోని హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో చెలగాటమాడితే.. ఆ దేవుడే శిక్షిస్తాడని సీఎం జగన్ పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాటి ఘటనపై ఆయన సీరియర్ అయ్యారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

 

 

 

Leave a Comment