జగన్ చెబితే చేస్తారు అంతే.. : పోసాని

చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతారని, ఆయన ఏ ఒక్కటీ కూడా చేయరని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైఎస్ జగన్ చెబితే కచ్చితంగా చేస్తారని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, ఎన్నికల్లో గెలవలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని విమర్శించారు. 

సీఎం జగన్ నిజాయితీ పరుడని, కాబట్టి తాను 11 ఏళ్లుగా ఆయన్ను ఫాలో అవుతున్నానని చెప్పారు. తాను పదవి కోసం కాని, ఇంకో దాని కోసం కాని కాకపట్టలేదని, వైఎస్ జగన్ రాజకీయాల్లో ప్రజలకు నిజాలు చెప్పి సీఎం అయ్యారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారంటే ప్రజలు నమ్మడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Leave a Comment