పొలంలో మహిళా కూలీకి దొరికిన వజ్రం.. లక్షాధికారి అయిన మహిళ..!

పొలంలో కూలి పనికి వెళ్లిన మహిళకు అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది. అక్కడ పనిచేస్తుండగా ఓ రంగు రాయి దొరికింది. దానిని స్థానికంగా ఓ వ్యాపారికి చూపించగా వజ్రమని నిర్ధారించాడు. 

4.5 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తుగ్గలి ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకడం సహజం. కొద్ది రోజుల క్రితం కూడా రైతులకు వజ్రాలు లభించాయి. దీంతో అక్కడ స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాలను అన్వేషిస్తుంటారు.  

Leave a Comment