ఆలయంలో నాలుక కోసేసుకున్న భక్తురాలు..!

ఈరోజుల్లో కూడా ప్రజలు రకరకాల మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. కాలంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా మూఢనమ్మకాలను మాత్రం నమ్ముతూనే ఉన్నారు. తాజాగా ఓ భక్తురాలు మూఢనమ్మకంతో ఆలయంలో అమ్మవారి విగ్రహం ముందు తన నాలుక కోసేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లాలో వెలుగు చూసింది. 

బడా గ్రామానికి చెందిన రాజ్ కుమారీ పటేల్(20) గురువారం స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయానికి తన తల్లిదండ్రులతో పాటు వచ్చింది. ఆలయంలో పూజ చేస్తుండగా ఉన్నట్లుండి ఆ యువతి తన నాలుక కోసేసుకుంది. తర్వాత ఆ నాలుకను అమ్మవారి పాదాల వద్దకు విసిరేసింది. 

ఆ యువతి చేసిన పనికి తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు. యువతిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. సమాచారం అందుకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఆలోచనతో యువతి ఈ పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

Leave a Comment