కృష్ణా జిల్లాలో ఘోరం : లంచం ఇవ్వనిదే శవాన్ని కూడా ఇవ్వలేదు..!

లంచం కోసం శవాన్ని కూడా వదల్లేదు ఓ హాస్పిటల్ కు చెందిన అటెండర్..కూతురు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కూతాడి కుసుమ లలితకు మచిలీపట్నంలోని ఏలాకురుకు చెందిన ఈశ్వర్ తో 2015లో వివాహమైంది. వారికి నాలుగేళ్ల పాప ఉంది. 

ఈనెల 21న ఈశ్వర్ తన భార్య లలితను గొంతు కోసం హత్య చేశాడు. మృతదేహాన్నిపోస్టు మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని తీసుకునేందుకు లలిత తల్లిదండ్రులు వెళ్లగా, మార్చురీ వద్ద ఉన్న అటెండర్ మృతదేహాన్ని ఇచ్చేందుకు రూ.6 వేలు డిమాండ్ చేశాడు..డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదన్నాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూ.1500 ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు తమ కూతురు శవాన్ని తెచ్చుకుని అంత్యక్రియలు నిర్వహించారు. 

 

Leave a Comment