ఎమ్మెల్యేపై దాడి

ఢిల్లీ : ఢిల్లీలో ఎమ్మెల్యే నారాయణ్ దత్ శర్మపై కొందరు దుండగులు దాడి చేయడం కలకల రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వస్తున్న నారాయణ్ దత్ శర్మ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. 10 మందికిపైగా ఉన్న ముఠా శర్మ వాహనంపై దాడికి తెగబడింది. దీంతో ఆయన కారు అద్దం ధ్వంసమైంది. అద్దంతో పాటు బ్యానెట్ కూడా పాడయింది. తనపై దాడి చేసింది ప్రత్యర్థులే అని నారాయణ్ దత్ శర్మ ఆరోపించారు. 

నారాయణ్ దత్ శర్మ బాదార్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా పాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు ఆప్ నిరాకరించింది. దీంత ఆయన బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. ఆప్ తరపును రామ్ సింగ్ నేతాజీ బరిలో ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నేత ఎన్నికలకు కొద్ది రొజుల ముందు ఆప్ లో చేరారు. ఆయనకే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ టికెట్ కేటాయించడంతో శర్మ బీఎస్పీలో చేరారు.

Leave a Comment