బంగాళఖాతంలో వాయుగుండం

నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని, భారత వాతావరణ శాఖ్(ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుపానుగా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కుస్తాయని పేర్కొన్నారు. 

మంగళవారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి  అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

 

Leave a Comment