ఏపీలో జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే వెలుగు చూస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మరోసారి పొడిగించింది. మే 5 నుంచి ప్రారంభమైన ఆంక్షలు నేటితో ముగియనుండగా.. కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.   

అయితే కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది. సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.  

Leave a Comment