అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. ఒకే రోజు 67 కొత్త కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారిగా కేసులు..
అనంతపురం – 2
చిత్తూరు – 6
తూర్పుగోదావరి – 9
గుంటూరు – 20
కడప – 15
కృష్ణ – 15
కర్నూలు – 1
నెల్లూరు – 3
ప్రకాశం – 15
విశాఖపట్నం – 11
పశ్చిమగోదావరి – 14