చెన్నై సూపర్ కింగ్స్ లో 10 మందికి కరోనా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎన్నో వాయిదాలతో చివరికి దుబాయి వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అందరి కంటే ముందే యూఏఈతో ప్రాక్టీస్ మొదలుపెట్టాలని భావించిన చెన్నై సూపర్ కింగ్స్ లో ఇప్పుడు కరోనా కలవరం రేపింది. ఆగస్టు 21న దుబాయ్ చేరుకున్న సూపర్ కింగ్స్ ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంది. 

అనంతరం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో ఒక ఫాస్ట్ బౌలర్ తో పాటు పలువరు స్టాఫ్ మెంబర్స్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తంగా 10 మంది సీఎస్ కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో సీఎస్ కే తమ క్వారంటైన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసు0కుంది. వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్ మొదలు కానున్న తరణంగా ఇంక ఎంత మంది కరోనా బారిన పడతారో అనే ఆందోళన మొదలైంది.  ఇప్పటికే 8 జట్లు యూఏఈలో అడుగుపెట్టాయి. 

Leave a Comment