రాముడిపై పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు..!

తెలంగాణ ఎస్సీ కార్పొరేసన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అయోధ్య రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముడు భారతదేశంలోనే పుట్టాడా లేక నేపాల్ లో పుట్టాడా లేక జర్మినీలో పుట్టాడో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్ లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజ్యాంగ రక్షణ సదస్సు’ లో ఆయన మాట్లాడారు. 

ప్రస్తుతం చందాల దందా మొదలైందని, అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో జై భీమ్ – జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందని చెప్పారు. అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదని, ఇటీవల నేపాల్ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని అన్నారని తెలిపారు. 

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి నిత్యం గుళ్లు, గోపురాలంటూ టీఆర్ఎస్ ను విమర్శించడం తగదని అన్నారు. దళితులు హిందువులే అయితే ఆలయాల్లోకి ఎందుకు ప్రవేశం కల్పించడం లేదని ప్రశ్నించారు. 

 

Leave a Comment