దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం-19 సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ ను గతవారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం-1986 ను భర్తీ చేసింది. ఈ కొత్త చట్టంలో వినియోగదారులకు కొత్త హక్కులు లభిస్తాయి. అయితే ఈ చట్టం ఈ ఏడాది జనవరిలోనే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు.
వినియోగదారుల ప్రజయోజనాలను పరిరక్షించడానికి నిబంధనలు రూపొందించిన తర్వాత వినియోగదారుల రక్షణ చట్టం-2019 మరింత సమగ్రంగా, కఠినంగా ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజాా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ తెలిపారు.
వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి మరియు అమలు చేయడానికి, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల పరిస్థితులలో జోక్యం చేసుకోవడానికి సెంట్రల్ కన్య్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఈ చట్టం ప్రతిపాదించింది.కేసుల మధ్యవర్తిత్వం మరియు ఇ-ఫైలింగ్ కోసం ఒక నిబంధనతో సరళమైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఈ చట్టం అందిస్తుంది. కల్తీ మరియు నకిలీ ఉత్పత్తుల తయారీదారులు మరియు అమ్మకందారులను కోర్టుకు లాగవచ్చు.
- ఈ కొత్త చట్టంలో లోపభూయిష్ట ఉత్పత్తి లేదా సేవ వల్ల కలిగే నష్టానికి పరిహారం అందించడానికి ఉత్పత్తి తయారుదారులు లేదా విక్రేతలు బాధ్యత వహించాలి.
- వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగని సందర్భాల్లో 6 నెలల వరకు జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమాన విధించవచ్చు.
- ఒక వేళ హాని జరిగితే రూ.5 లక్షల వరకు జరిమానా మరియు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.
- ఒకవేళ వినియోగదారుడు మరణిస్తే, రూ.10 లక్షల వరకు జరిమానా మరియు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.