రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..!

రైలు కదులుతున్నప్పుడు ప్లాట్ ఫాం మధ్యలో పడ్డ వ్యక్తి ప్రాణాలను ఓ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన దాహోద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రైలు కదులుతున్నప్పుడు ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి జారిపోయి రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్యలో పడ్డాడు.

 కదులుతున్న రైలు ఆ వ్యక్తిని అలా లాక్కుని పోతూ ఉండటాన్ని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాబూ రాథోడ్  గమనించాడు. ఆ వ్యక్తిని పట్టుకుని అలాగే రైలు వెంట పరిగెత్తాడు. ఇంతలో రైలు ఆగడంతో అతడికి ప్రమాదం తప్పింది. అనంతరం ఆ వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మళ్లీ అదే రైలు ఎక్కించాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రయాణికులు, స్టేషన్ లోని వారు కానిస్టేబుల్ కు సెల్యూట్ చేశారు.   

Leave a Comment