లాక్ డౌన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అదేవిధంగా కరోనా రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 

కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకునే విషయమై వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని, ఇలా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేరకమైన విధానం రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. 

ఇక సామూహిక కార్యక్రమాలు, సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లపై నిషేధం విధించాలని సూచించింది. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు కోరింది. లాక్ డౌన్ విధించినట్లయితే వలస కార్మికులు సహా ఇతర బడుగు జీవులు ఇబ్బందులు పడకుండా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలిన ఆదేశించింది. 

Leave a Comment