సామాన్యులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టి శనివారానికి ఏడాది పూర్తి అయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా స్టాలిన్ సామాన్యులను కలుస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సైకిల్ మీద ప్రయాణించి.. ఓ టీ స్టాల్ లో కూర్చొని ప్రజలతో మాట్లాడారు.  

తాజాగా సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో సామాన్యులతో కలిసి ప్రయాణించారు. తన ఏడాది పాలనపై ప్రయాణికుల, డ్రైవర్, కండక్టర్ అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. బస్సులోని సౌకర్యాలు, బస్సు కండీషన్ ని తనిఖీ చేశారు. 

ఆ తర్వాత మెరీనా బీచ్ లో ఉన్న కరుణానిధి స్మారకం, అన్నా మెమోరియల్ కు చేరుకున్నారు. అక్కడ ఆయన కరుణానిధి స్మారకం వద్ద నివాళి అర్పించారు. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై మెమోరియల్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 

 

 

Leave a Comment