ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు..!

దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీదు వెలుగు, చెబు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. 

చంద్రబాబు :

అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దేవ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజాంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడి రోజు, బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన శుభదినం, రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినం, అరాచకాల చీకట్ల నుంచి ఆనందపు వెలుగుల వైపు నడిపించే వెలుగు దివ్వెల పండుగ దీపావళి అని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ఈ దీపావాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. 

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ :

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి యొక్క దైవిక కాంతి మన అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుందన్నారు. కరోనా వంటి సందర్భాలు, విపత్తులను జయించటానికి శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి మనం కృషి చేయాలన్నారు. 

Leave a Comment