కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు.. రక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను సీఎం చూశారు. ఆ సినిమా చూసిన సీఎం బొమ్మై ఎమోషనల్ అయ్యారు. అందులో సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఎమోషనల్ అవ్వడానికి అందులో ఏముందనుకుంటున్నారా..
ఈ సినిమాకు కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బంధాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సన్నివేశాలు చూసిన సీఎం బసవరాజ్ బొమ్మై ఒక్కసారిగా కంట కన్నీరు పెట్టుకున్నారు.
గతంలో సీఎం బొమ్మై స్నూబీ అనే కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్క చనిపోయింది. దాని అంత్యక్రియల సమయంలోనూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఓ ఇంటర్వ్యూలోనూ స్నూబీ ఫొటోలను చూపించినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘777 ఛార్లీ’లో సన్నివేశాలు ఆయనకు స్నూబీని గుర్తుకు తెచ్చినట్లు ఉన్నాయి. అందుకే ఆయన బోరున ఏడ్చేశారు.
కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయని, కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారని ఆయన అన్నారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుందని, సినిమా చాలా బాగుందని, అందరూ తప్పకుండా చూడాలని తెలిపారు. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ అని, చాలా స్వచ్ఛమైనదని అన్నారు.
Chief minister Basavaraj Bommai broke down after watching #777Chalie yesterday. The movie reminded him of his pet dog. Avid dog lover, Bommai when he was home minister, his pet died and these pics went viral.#Dogs♥️ pic.twitter.com/BtxYRigtwh
— Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್🇮🇳 (@AshwiniMS_TNIE) June 14, 2022