ప్రియుడిపై మోజుతో కన్న బిడ్డకు చిత్రహింసలు.. అరెస్టు చేసిన పోలీసులు..!

ప్రియుడిపై మోజుతో కన్న బిడ్డను చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి.. తన అక్రమ సంబంధాన్ని భర్త బహిర్గతం చేశాడు. దీంతో పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను హింసించింది.  అంతే కాదు కొడుతున్న సమయంలో వీడియోలు కూడా తీసింది. ఈ వీడియోలు వైరల్ గా కూడా అయ్యాయి. ఆ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల మేరకు తమిళనాడులోని విల్లుపురం జిల్లా మనలప్పాడి మధురమేట్టూరు గ్రామానికి చెందిన వడివళగన్ కు, చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసికి కొన్నాళ్ల క్రితం వివాహం అయింది. వీరికి గోకుల్(4), ప్రదీప్(2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  భర్తతో విభేదాలు రావడంతో కుమారుడితో కలిసి చిత్తూరు జిల్లా అనిపల్లిలో తండ్రి వద్ద ఉంటుంది. 

భర్తపై కోపంతో రెండేళ్ల కొడుకును చిత్రహింసలకు గురిచేసింది. అంతేకాదు కొడుకును హింసిస్తున్న దృశ్యాలను వీడియోలు తీసి భర్తకు పంపింది. దెబ్బల ధాటికి రెండేళ్ల బాబు ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భర్త వడివలగన్ సత్యమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.    

Leave a Comment