విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చిరు ట్వీట్..!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం వివిధ రాష్ట్రాలకు చేస్తున్న సేవల గురించి కొనియాడారు. ‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరంది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్ర తీసుకెళ్తుంది. 

విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయడం ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి..

Leave a Comment