ఛత్తీస్ గడ్ సీఎంకు కొరడా దెబ్బలు.. ఏమైందంటే?

ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ శనివారం దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆయన మరుసటి రోజు తన స్వగ్రామం దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామానికి వెళ్లారు. అక్కడ గోవర్ధన పూజలో పాల్గొన్నారు. అనంతరం సీఎం బఘేల్ ను బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి కొరడా దెబ్బలు కొట్టారు. 

ఆ గ్రామంలో గోవర్ధన పూజ అనంతరం ఇలా చేతిపై కొరడాతో కొట్టించుకోవడం అక్కడి సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది.  సీఎం కూడా ప్రతి ఏడాది దీపావళి అనంతరం గ్రామానికి వచ్చి ఈ పూజలో పాల్గొని కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. 

Leave a Comment