వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు
విజయవాడ : ఏపీ గవర్నర్ హరిచందన్తో మాజీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను గవర్నర్కు చంద్రబాబు వివరించారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం చేశారని, అనేక జిల్లాల్లో ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, ఖూనీ చేస్తున్నారని, ఎవరైనా మాట్లాడితే ఆర్థికంగా, భౌతికంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని, వైసీపీ అరాచకాలపై గవర్నర్ స్పందించాలని చంద్రబాబు కోరారు. ఉన్మాదంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కండకావరం, ఒళ్లు బరువెక్కి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.