Viral Video: పూజ చేస్తుండగా.. పేలిపోయిన బుల్లెట్ బండి..!

వేసవిలో మనుషులే కాదు.. బైక్ లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు ఎండలకు కాలిపోతున్న సందర్భాలు చూస్తున్నాం.. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఉన్న పళంగా పేలిపోయింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద చోటుచేసుకుంది..

వివరాల మేరకు.. రవిచంద్ర అనే వ్యక్తి కొత్త బుల్లెట్ బండిని కొనుగోలు చేశాడు. అతడు మైసూర్ నుంచి సుమారు 387 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంతకల్లు మండలం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నాడు. ఉగాది పర్వదినం రోజున ఆలయంలో పూజ చేయించేందుకు పార్కింగ్ వద్ద బుల్లెట్ బండిని పార్క్ చేశాడు.

ఆ వ్యక్తి పూజ కోసం ఆలయంలో ప్రవేశించిన కొద్ది సేపటికే బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే మంటలు పెట్రోల్ ట్యాంకుకు చేరి పెద్ద పేలుడు సంభవించింది.  దీంతో స్థానికంగా ఆందోళన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైక్ మాత్రం దాదాపు దగ్ధమైపోయింది.  

 

 

 

 

Leave a Comment