బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..

రోజుకు 5 జీబీ డేటా ఉచితం..

కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది. 

కాగా, ఎయిర్ టెల్, జియో వంటి ప్రైవేట్ ప్రొవైడర్లు, ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడటానికి ఈ ఆఫర్ సహాయపడుతుందని సంస్థ భావిస్తోంది. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం  అనుసరిస్తున్న వివిధ విధానాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. దీన్ని ప్రోత్సహించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ని ప్రకటించనట్లు బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్ఏ వివేక్ బంజాల్ పేర్కొన్నారు. 

బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాడ్ బ్యాండ్ లేని దేశ వ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ ఈ సేలను, ఒక నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ డైన్ స్పీడ్ ను, 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం కోసం 1 ఎంబీపీఎస్ కు పరిమితమవుతుంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుంచి పని చేసుకోవడానికి, ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ సీఎఫ్ఏ వివేక్ బంజాల్ తెలిపారు. 

Leave a Comment