పతంజలి కరోనా మందుకు ఆదిలోనే బ్రేక్..

పతంజలి కరోనా మందుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఏడు రోజుల్లో కరోనా వైరస్ ను నయం చేయగలమని పేర్కొంటూ యోగ గురువు బాబా రామ్ దేవ్ పతంజలి కరోనిల్ పేరుతో మందును ప్రారంభించారు. అయితే ఈ ఆయుర్వేద ఔషధ పరిశోధన వివరాలను వెల్లడించాలని, అప్పటి వరకు ఎటువంటి ప్రచారం చేయడానికి వీల్లేదని ఆయూష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది. 

ఈ ఔషధానికి సంబంధించి పరిశోధన ఫలితాలు, పరిశోధనలు నిర్వహించిన ఆస్పత్రుల వివరాలను అందించాలని కోరింది. ఇన్ స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ నుంచి క్లియరెన్స్ మరియు సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను వెల్లడించాలని చెప్పింది. 

పతంజలి అట్టహాసంగా కరోనిల్ మందును ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయూష్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పతంజలి కరోనిల్ కి సంబంధించి వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తెలియదని పేర్కొంది. కరోనిల్ తయారీకి మంజూరు చేసిన లైసెన్స్ కాపీలు, అనుమతి వివరాలను అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరింది. 

Leave a Comment