బీజేపీ ముమ్మాటికీ హిందువుల పార్టీ : బండి సంజయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని, హిందూ ధర్మానికి అడ్డం వచ్చిన వాళ్లను తొక్కేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఓ నియంతల వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్దలు కొడతామని చెప్పారు.  

ఇటీవల్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా మైలార్ దేపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా దుర్గానగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సమక్షంలో సభ నిర్వహించారు. ఈ సభలో సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూం, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వరద నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. 

Leave a Comment