‘బిగ్ బాస్ -4’ వ్యాఖ్యాతగా మహేష్..!

భాషలతో సంబంధం లేకుండా విజయవంతంగా కొనసాగుతున్నటెలివిజన్ షో బిగ్ బాస్. అయితే తెలుగు తెరపై ఈషో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ కు ఆదరణ బాగా పెరగడంతో ఈ షోను ఇలానే కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కు ఎన్టీఆర్ ను మళ్లీ హోస్ట్ గా ఉండాలని కోరారట. భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. కానీ ఈ షోకు మళ్లీ హోస్ట్ గా వచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ అంతగా ఆసక్తి చూపలేదట. దీంతో నిర్వాహకులు మహేష్ ను సంప్రదించినట్లు సమాచారం.

 బిగ్ బాస్ మొదటి సీజన్ లో యంగ్ టైగర్ ఎన్జీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా..రెండో సీజన్ లో నాని వ్యాఖ్యాతగా తన సత్తా చాటాడు. ఇక మూడో సీజన్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున అడుగుపెట్టి షోను మరింత రసవత్తరంగా మలిచాడు. దీంతో టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగి నెంబర్ వన్ రియాల్టీ షోగా కీర్తి గడించింది. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తిని చూపుతున్నట్లు ఫిలంగనర్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాడు గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ ఫార్మాట్ ను నిర్వాహకులు మారుస్తున్నారట. ఒక వేళ్ల ఇదే నిజమైతే ఈ సారి బిగ్ బాస్ మరింత క్రేజీగా మారండ ఖాయం. 

Leave a Comment