రేపటి నుంచి జర జాగ్రత్త..

రాష్ట్ర ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకాశం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నాలుగు రోజులు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవాల్సి ఉంటుంది. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి అని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

  మే   22న ఉష్ణోగ్రతలు..

  • శ్రీకాకుళం , విజయనగరం ,  విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   23న ఉష్ణోగ్రతలు

  • విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°C-48°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • విజయనగరం ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  
  • శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మే   24న ఉష్ణోగ్రతలు

  • విజయనగరం , విశాఖపట్నం,  క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C  – 43°C  ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  
  • శ్రీకాకుళం, కడప, అనంతపురం , కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.   

 మే   25న ఉష్ణోగ్రతలు

  • ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • విజయనగరం ,  విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

 

Leave a Comment