ప్రవచనాలు చెబుతూనే.. ప్రాణాలు విడిచిన బసవ స్వామిజీ.. వీడియో వైరల్..!

కర్ణాటకలోని బెళగావి జిల్లా గోకాక్ సమీపంలోని బలోబల్ మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ స్వామి(54) గుండెపోటుతో మరణించారు. మంగళవారం భక్తులకు ప్రవచనాలు చెబుతూనే స్టేజిపైనే కన్నుమూశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా భక్తులకు ప్రవచనాలు బోధిస్తుండగా తన కుర్చీలో కుప్పకూలిపోయారు. 

దీంతో పక్కనే ఉన్న వారు స్వామిజీని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బసవ స్వామి తన కుర్చీలో కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

Leave a Comment