వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. తమ బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఇంటి నుంచే పొందేందుకు నూతన సర్వీసును ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ పొదుపు ఖాతాలో నిల్వను, చివరి మూడు లావాదేవి వివరాలను, క్రెడిట్ కార్డు పరిమితిని చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది. వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కస్టమర్లు వివిధ ఆఫర్ల వివరాలు పొందవచ్చని, క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకాన్ని బ్లాక్, అన్ బ్లాక్ చేసుకోవచ్చని తెలిపింది. బ్రాంచ్ ను సందర్శించకుండానే తమ కస్టమర్లు బ్యాంకింగ్ అవసరాలను నెరవేర్చుకోవచ్చని, తమ కస్టమర్లకు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి తెలపారు. 

Leave a Comment