ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బాలయ్య..!

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ అని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారాకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. 

ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. వెండితెరపై ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారని, ట్రెండ్ సెట్టర్ గా భారతదేశ చలన చిత్ర పరిశ్రమంలో నెంబర్ వన్ హీరోగా ఆయన ఎదిగారని చెప్పారు. ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే సూర్యున్ని వేలితో చూపించడమే అవుతుందన్నారు. 

ఆయన జీవితం మనందరికీ ఓ పాఠ్యాంశం అన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో పాటు సంక్షేమ పాలనతోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. తెలుగు వాళ్లు మద్రాసియులు అని పిలవబడుతున్న సమయంలో తెలుగు జాతి గొంతు ఎత్తి చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. 

Leave a Comment