‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు’పై స్పందించిన బాలయ్య.. కళ్లల్లో నీళ్లొస్తున్నాయి అంటూ..!

టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారాక రామారావు.. నటుడిగానే కాదు.. రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజా జీవితంలోకి వచ్చిన ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  అయితే ఆయన రాజకీయ ప్రస్తానం చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటాయి..

తాజాగా అన్ స్టాపబుల్ టాక్ షో ప్రోమోలో ఎన్టీఆర్ తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు’పై స్పందించారు. ‘ముఖ్యంగా తప్పుడు ప్రచారం.. వెన్నుపోటు పొడిచారు అంటూ చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తాయి.. ఎందుకంటే.. నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, నేను ఆయన ఫ్యాన్స్ లో ఒకడిని’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. మరీ బాలకృష్ణ చెప్పింది విన్న తర్వాత ఈ ఆరోపణలకు నాయకులు ముగింపు పలుకుతారో లేదో మరీ..   

Leave a Comment