మంచి మనుసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం రూ.5లక్షలు ఆర్థికసాయం..!

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మంచి మనుసును చాటుకున్నారు. ఓ చిన్నారి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఏడేళ్ల బాలిక కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. చికిత్స కోసం బసవతారకం ఆస్పత్రిలో చేరింది. 

ఇక మణిశ్రీ ఆపరేషన్ కోసం రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో రూ.1.80 లక్షలు సేకరించారు. ఇంకా రూ.5.20 లక్షలు అవసరమయ్యాయి. దీంతో మణిశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిసి తమ పరిస్థితి వివరించారు.

దీంతో బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు చిన్నారి వ్యాధి గురించి, వారి పరిస్థితి గురించి నటుడు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే స్పందించారు. డాక్టర్లతో మాట్లాడి రూ.5.20 వేలు మాఫీ చేయించారు. అంతేకాదు మణిశ్రీకి మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీతో బిజీగా ఉన్నారు. 

 

Leave a Comment