ఆత్మకూరు ఉప ఎన్నిక.. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు..!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి అధిక్యాన్ని ప్రదర్శించిన విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. 

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.. వైసీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి భరత్ కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీలో దిగారు.. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో విక్రమ్ రెడ్డి తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగారు.. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ ఆయనకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు.   

 

Leave a Comment