‘అసని’ తుపాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకులం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం సున్నపల్లి సముద్ర తీరానికి బంగారు రంగు మందిరం కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన స్థానికులు తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు..
దీనిని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. ఈ రథం మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందిన అయి ఉండొచ్చని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఇవి వేరే దేశం నుంచి వచ్చి ఉండవచ్చని, తాము ఇంటెలిజెన్స్, ఉన్నతాధికారులకు సమాచారం అందించామని మెరైన్ పోలీసులు తెలిపారు.
View this post on Instagram