నిరుద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ఖాళీగా ఉన్న 5 వేల ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల నియామక పక్రియను ప్రారంభించింది. ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను www.apprenticeship.govin వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ మార్చ 21, 2020 గా నిర్ణయించింది. అభ్యర్థుల ఒరిజనల్ సర్టిఫికెట్ల పరిశీలన ఏప్రిల్ 9న జరగనున్నట్లు తెలుస్తోంది.
పోస్టుల వివరాలు..
డిజిల్ మెకానిక్ -3,160
మోటార్ మెకానిక్ – 200
ఎలక్ట్రీషియన్లు – 560
వెల్డర్లు – 160
పెయింటర్లు – 320
మిల్ రైట్ మెకానిక్ – 52
మెషినిష్టులు – 16
షీటుమెటల్ వర్కర్లు – 520
స్టైఫండ్ – రూ.6931/