రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకం..!

హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ గోపాల క్రిష్ణ ద్వివేది గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఆయనను తిరిగి ఆ పదవిలో నియమిస్తున్నట్లు తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తుది తీర్పుకు లోబడి ఈ నియామకం కొనసాగుతుందని గవర్నర్ ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ జారీ చేసిన నోటిపికేషన్ ను జతపరిచి ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 

 

Leave a Comment