ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ

ఏపీ మంత్రి తానేనటి వనిత సంతకం ఫోర్జరీ వ్వవహారం కలకలం రేపింది. ఏకంగా మంత్రి లెటర్ హెడ్ తో పాటూ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి వనిత సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్ ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపీ అధికార వర్గాల్లో సంచలనంగా మారంది.

కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఆ లెటర్ హెడ్ పై మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్ కు సిఫార్సు లేఖ రాసినట్లు గుర్తించారు. రెడ్డప్పకు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆ లేఖలో కోరినట్లు తెలిసింది. కానీ మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప అడ్డంగా దొరికిపోయాడు. అతడు టీడీపీ నేత అని తెలుస్తోంది. మంత్రి తానేటి వనిత నేరుగా హోం మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

Leave a Comment