AP Grama Sachivalayam 2020 Results
ఏపీలో నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. గత నెల 20 నుంచి 26 వరకు 13 శాఖల్లో మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా ఈ పరీక్షలకు 7.69 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను http://gramasachivalayam.ap.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- ముందుగా http://gramasachivalayam.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేేయాలి.
- హోమ్ పేజీలో Examination Results పైన క్లిక్ చేయాలి.
- తర్వాత అభ్యర్థుల అడ్మిట్ కార్డు, ఇతర వివరాలు ఎంట్ చేసి లాగిన్ కావాలి.
- ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.