వాహనాల జరిమానాలు భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన చట్టంలో మార్పులు తీసుకురావడంతో పాటు,  వాహన నిబంధన ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచింది. బైక్ ల నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానాలను సవిరస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనలు వెంటనే అమలులోకి రాబోతున్నాయి. వాహన నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నాట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

పెంచిన జరిమానాలు ఇలా ఉన్నాయి..

  • వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750 
  • సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750 
  • అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
  • అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
  • రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
  • వేగంగా బండి నడిపితే – రూ. 1000
  • సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
  • రేసింగ్ లో మొదటిసారి పట్టుబడితే రూ. 5000, రెండో సారి పట్టుబడితే రూ. 10000
  • రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
  • పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
  • ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
  • వాహనం బరువు చెకింగ్  కోసం ఆపక పోయినా – రూ. 40000
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
  • అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
  • రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి – రూ. లక్ష

Leave a Comment