‘భరతభూమిలో గాడ్సే లాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’ 

నాథూరామ్ గాడ్సే గురించి ఏపీ బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు చేసి ట్వీట్ వివాదాస్పదమైంది. నవంబర్ 15న గాడ్సే వర్థంతి సందర్భంగా ఆయను పొగుడుతూ రమేష్ నాయుడు ఓ ట్వీట్ చేశారు. ‘నేడు నాథూరాం గాడ్సే వర్థంతి. ఈ సందర్భంగా గాడ్సేకు సెల్యూట్ చేస్తున్నా. అలాగే ఆయన పట్ల సంపూర్ణ కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ఇంతటి గొప్ప దేశభక్తుడు ఇంతవరకు జన్మించలేదు’ అంటూ ట్వీట్ చేశారు. 

కాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. అలాగే ఓ ట్వీస్ట్ కూడా ఇచ్చారు. ‘నా ట్విట్టర్ ను హ్యాండిల్ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. వారి సేవలను తొలగించడమైనది’ అంటూ వివరణ ఇచ్చారు.  

Leave a Comment