సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుంబ్లే..!

టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్ ను కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎం జగన్ తో భేటి అయ్యారు. ఈమేరకు సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లేను సాదరంగా ఆహ్వానించి, కొద్ది సేపు ముచ్చటించారు. 

అనిల్ కుంబ్లే సీఎం జగన్ కు ఓ గిఫ్ట్ కూడా అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలు రాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి అందజేశారు. సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లేను శాలువతో సత్కరించి, శ్రీవారి విగ్రహాన్ని బహూకరించారు. ప్రస్తుతం సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే భేటీ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా, టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే, భారత జట్టుకు ప్రధాన కోచ్ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టారు. టీమిండియా తరపున 18 సంవత్సరాల పాటు తన సేవలు అందించాడు. టెస్టుల్లో 619 వికెట్లు, వన్డేల్లో 337 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.   

 

 

Leave a Comment