క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర బంపర్ గిఫ్ట్..!

ఆస్ట్రేలియా సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. ఆసీస్ కు ఊహించని షాక్ ఇచ్చి సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.  ఇక ఈ సిరీస్ లో సీనియర్లు గాయపడటంతో ఆరు మంది క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఆరంగేట్రంలోనే తమ అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. 

కాగా ఆరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంది ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర వారికి ఎస్ యూవీ వాహనాలను అందిస్తున్నట్లు ప్రకటించారు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్ మన్ గిల్, నవ్ వీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్ లకు తమ కంపెనీకి చెందిన థార్ ఎస్ యూవీ కార్లను గిఫ్ట్ ఇస్తామని వెల్లడించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, తమ ప్రదర్శనతో భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. 

Leave a Comment