స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, సంక్షేమ పథకాలు నిలిపేయాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అమ్మఒడి పథకం అమలు అవుతుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. జీవో నంబర్ 3 విడుదల చేశామని, రాష్ట్రంలో 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం జగన్ జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.