మళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కరోనాను జయించారు. కరోనా నుంచి కోలుకుని ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా, అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం రాత్రి ఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా ఆయన శ్వాసకోస ఇబ్బందులతో, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. 

ఆయనకు కోవిడ్ టెస్టు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశాయి. కాగా, ఆగస్ట్ 2న అమిత్ షా కరోనా బారినపడ్డారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకొని, అనంతరం ఆయన కోలుకొని ఆగస్టు 14న ఇంటికి వచ్చారు. 

 

Leave a Comment