ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాకు ఘోర అవమానం..!

ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాకు ముంబై ఎయిర్ పోర్టులో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టులో అధికారులు క్రునాల్ పాండ్యాను అడ్డుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఎయిర్ పోర్టులోనే నిలిపేశారు. దుబాయ్ నుంచి పాండ్యా తీసుకొస్తున్న పలు వస్తువులకు అనుమతుల్లేవనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పాండ్యాను అక్కడే నిలిపేశారు. 

పాండ్యా వద్ద బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ప్రశ్నించారు. పాండ్యా దుబాద్ లో రెండు రోలెక్స్, రెండు అడెమర్ పైగట్ వాచ్ లు కొన్నాడని, వాటి విలువ రూ.75 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమచారం. వాటితో పాటు కొంత బంగారం కూడా తీసుకొస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వస్తువులకు ఇండియాకు తీసుకురావడానికి అనుమతులు చూపించాలని అధికారులు పాండ్యాను కోరారు. ఈ వస్తువులకు సరైన ధ్రువపత్రాలు లేకుంటే వీటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.  

 

Leave a Comment