కంగనాకు ప్రకాశ్ రాజ్ కౌంటర్.. అవునూ.. ఇది కొత్త భారతం..!

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ జాతీయ రాజకీయాల నుంచి సినీ వర్గాల వరకు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేనే ఎదిరించి వార్తల్లో నిలిచింది. ఆమెకు వై కేటగిరి భద్రత కూడా ప్రభుత్వం కల్పించింది. ఈక్రమంలో టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ నటి కంగనాపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఝాన్సీ లక్ష్మీబాయ్ లా పోరాడుతానని కంగనా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది వీరుల పాత్రలు పోషించారని, ఒక్క సినిమాతో ఝాన్సీ లక్ష్మీబాయ్ అయిపోయానని అనుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా అయితే పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, జోధా అక్బర్ లో హృతిక్ రోషన్, అశోక లో షారూక్, భగత్ సింగ్ లో అజయ్ దేవ్ గన్, మంగళ్ పాండే గా నటించిన అమీర్ ఖాన్, ఇక మోడీగా నటించిన వివేక్ ఒబెరాయ్ ఏమనుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఇక లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు పొట్టచేతపట్టుకుని ఎండలో నడుచుకుపోతుంటే లేని భద్రత..ఓ నటికి ఎందుకని ప్రశ్నించారు. ‘అవునూ ఇది కొత్త భారతం అంటూ’ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలను సైతం షేర్ చేశారు. 

 

Leave a Comment