అల్లర్లకు కారణమైన నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్..!

రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూను పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రకటించారు.  రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై జెండా ఎగురవేడయం, ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో సిద్ధూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

 ఆ తర్వాత దీప్ సిద్ధూ పరారీలలో ఉన్నాడు. దీప్ సిద్ధూ, మరో ముగ్గురు నిందితులపై పోలీసులు లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. దీప్ సిద్ధూ తరుచూ ఓ మహిళ స్నేహితురాలితో టచ్ లో ఉండేవారు. కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెకు అతను ఎప్పుడూ వీడియోలను పంపేవాడని పోలీసుల విచారణలో తేలింది. సిద్ధూ పంపిన ఫొటోలను, వీడియోలను ఆ మహిళ పేస్ బుక్ లో అప్ లోడ్ చేసేది. చంఢీఘడ్ – అంబాల మధ్య ఉన్న జిరాక్ పూర్ లో దీప్ సిద్ధూను అరెస్టు చేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.  

 

Leave a Comment