నీళ్లు అనుకొని యాసిడ్ తాగిన విద్యార్థి..!

ఓ వ్యాపిరి నిర్లక్ష్యం డిగ్రీ విద్యార్థిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ లయోల కాలేజీలో చైతన్య డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడేందుకు ఎనికేపాడు వెళ్లాడు. 

చైతన్యకు దాహంగా ఉండటంతో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి పొరపాటున వాటర్ బాటిల్ కి బదులు డిస్టిలరి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించని చైతన్య నీళ్లు అనుకొని తాగేశాడు. యాసిడ్ లోపలికి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చైతన్యను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చైతన్య కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో లయోల కాలేజీ విద్యార్థులు విరాళాలు సేకరిస్తున్నారు.     

Leave a Comment