నన్ను ఎన్నికల్లో గెలిపించలేదు.. డబ్బులు తిరిగి ఇచ్చేయండి..!

మధ్యప్రదేశ్ లోని నీమూచ్ జిల్లాలో ఓ గ్రామస్తులకు విచిత్రమై అనుభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి.. ఎన్నికల సమయంలో పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

వివరాల మేరకు జిల్లాలోని దేవ్ రణ్ గ్రామంలో ఇటీవల సర్పంచి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రాజు దేమా అనే వ్యక్తి పోటీ చేశాడు. ప్రచారం సమయంలో తనకే ఓట వేయాలని గ్రామస్థులకు డబ్బులు పంచిపెట్టాడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అతడు ఓడిపోయాడు.

దీంతో రాజుకు కోపం వచ్చింది. ఎన్నికల సమయంలో తన వద్ద డబ్బు తీసుకున్న వారందరినీ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని జనాన్ని రాజు బెదిరిస్తున్న వీడియో రాంపూర్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు రాజుపై ఐపీసీ సెక్షన్ 323, 294, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

Leave a Comment