కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి..!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో – లారీ ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

 మృతుల్లో ఓ చిన్నారితో పాటు, 8 మంది మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారు. ఈ టెంపో రోడ్డు డివైడర్ ను అతివేగంతతో ఢికొట్టి, డివైడర్ పై పడి రోడ్డు అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన వారు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ కు వెళ్తున్నట్లు తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.   

సీఎం జగన్ దిగ్భ్రాంతి..

ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు మరియు వైద్య సహాయం వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

 

Leave a Comment